AP CM Jagan: ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే - నారా లోకేష్

Nara Lokesh Comments on AP CM Jagan Regarding Oxygen Shortage in Vizianagaram Government Hospital
x

నారాలోకేష్ (ఫైల్ ఇమేజ్)

Highlights

AP CM Jagan: ఆక్సిజన్ అందక ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

AP CM Jagan: విజయనగరం మహరాజా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు పోతుంటే సీఎం జగన్ తాడేపల్లి నివాసంలో ఐపీఎల్ మ్యాచ్ లు మిస్ కాకుండా చూస్తున్నారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత లేకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories