Nandigam Suresh: చంద్రబాబు ఐటీ నోటీసులపై సమాధానం చెప్పకుండా.. తేలుకుట్టిన దొంగలా తిరుగుతున్నాడు

Nandigam Suresh: నోటీసులపై బీజేపీ, వామపక్ష పార్టీలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి

Shekhar G
Published on: 7 Sept 2023 4:31 PM IST
Nandigam Suresh Comments on Chandrababu Naidu
X

Nandigam Suresh: చంద్రబాబు ఐటీ నోటీసులపై సమాధానం చెప్పకుండా.. తేలుకుట్టిన దొంగలా తిరుగుతున్నాడు

Nandigam Suresh: టీడీపీ అధినేత చంద్రబాబుపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కీలకవ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బాగోతం బయటపడిందని సురేష్ ఆరోపించారు. ఐటీ నోటీసులపై సమాధానం చెప్పకుండా చంద్రబాబు తేలుకుట్టిన దొంగలా తిరుగుతున్నాడని అన్నారు. చంద్రబాబు నోటీసులపై పవన్ కళ్యాణ్, బీజేపీ, వామపక్ష పార్టీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. తన తండ్రి వీరడూ, సూరుడు అని గొప్పలు చెప్పే నారా లోకేష్ ఎందుకు నోరు మేదపడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ సంస్థల నుంచి చంద్రబాబు అక్రమంగా డబ్బులు ఎలా సంపాదించారో అన్ని లెక్కలు బయటకు వస్తున్నాయని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story