MLA Roja Visits Durga Temple : దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజలు!

MLA Roja Visits Durga Temple : దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజలు!
x
Nagari mla rk roja visits kanaka durgamma temple in vijayawada
Highlights

సినీ నటీ, నగిరి ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.శ్రావణ శుక్రవారం

MLA Roja visits durga Temple : సినీ నటీ, నగిరి ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్టుగా ఆమె తెలిపారు. అనంతరం ఆమె ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి.. తీర్థప్రసాదాలు ఇచ్చారు.. లక్ష్మీదేవి నట్టింట్లోకి నడిచిరావాలని, బాధలు, కష్టాలు తొలగిపోవాలని వరలక్ష్మిని కోరుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రోజా ఆధ్యాత్మిక పర్యటనల్లో ఉన్నారు. కొన్నిరోజుల క్రితం ఆమె చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ప్రసిద్ద పుణ్యక్షేత్రం సింగిరి కోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక శ్రావణ శుక్రవారం కావడంతో విజయవాడ కనకదుర్గమ్మను కూడా దర్శించుకున్నారు.

ఇక అటు తెలగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతం పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కరోనా నేపధ్యంలో ప్రతి ఒకరూ ఇంట్లోనే పూజలు నిర్వహిస్తున్నారు. నిర్మాత, నటి మంజుల ఘట్టమనేని కూడా ఇంట్లోనే వరలక్ష్మీ వత్రం పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు. హీరోయిన్ ప్రణిత కూడా ఇంట్లోనే పూజలు నిర్వహించి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక శ్రావణ శుక్రవారం రోజున మహిళలలు మహాలక్ష్మీ ఎంతో నిష్ఠతో పూజిస్తారు. మహలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని భావిస్తారు. ఇక శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories