Ration Shops: ఏపీలో ఆదివారం కూడా రేషన్ షాపులు ఓపెన్: మంత్రి నాదెండ్ల మనోహర్

Ration Shops
x

Ration Shops: ఏపీలో ఆదివారం కూడా రేషన్ షాపులు ఓపెన్: మంత్రి నాదెండ్ల మనోహర్

Highlights

AP Ration Shops: "జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు, ప్రతి రోజూ – ఆదివారంతో సహా – రేషన్ షాపులు తెరిచి ఉంటాయి. పేదలకు ఇది ఎంతో ఉపయోగకరం. రోజువారీ కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు, సెలవు రోజుల్లో మాత్రమే సరుకులు తీసుకునే వీలున్నవారికి ఆదివారం కూడా షాపులు పనిచేయడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని మంత్రి పేర్కొన్నారు.

AP Ration Shops: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీలో మరో కీలక ముందడుగు వేసింది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించనున్న నేపథ్యంలో, లబ్ధిదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో గురువారం నిర్వహించిన రేషన్ సరుకుల పంపిణీ ట్రయల్ రన్‌ను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.

"జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు, ప్రతి రోజూ – ఆదివారంతో సహా – రేషన్ షాపులు తెరిచి ఉంటాయి. పేదలకు ఇది ఎంతో ఉపయోగకరం. రోజువారీ కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు, సెలవు రోజుల్లో మాత్రమే సరుకులు తీసుకునే వీలున్నవారికి ఆదివారం కూడా షాపులు పనిచేయడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని మంత్రి పేర్కొన్నారు.

గతంలో రేషన్ వాహనాల కోసం వేచి ఉండే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు షాపుల ద్వారా సరుకుల పంపిణీ జరగడం వల్ల అవన్నీ తొలగిపోతాయని తెలిపారు.

ప్రభుత్వ ప్రాధాన్యత ప్రజల సౌలభ్యం అని స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్, వృద్ధులు, దివ్యాంగులు రేషన్ షాపులకి రాలేని పరిస్థితుల్లో ఉంటే వారి ఇళ్లకే సరుకులు చేర్చేలా డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

ఇకపై రేషన్ పంపిణీ మరింత సులభంగా, సమర్థవంతంగా జరుగుతుందని, ఈ నిర్ణయం నగరాలు, పట్టణాల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులకు, కార్మికులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories