నిమ్మగడ్డపై సెటైర్ వేసిన విజయసాయిరెడ్డి

Arun Chilukuri
Updated on: 11 Jan 2021 6:08 PM IST
MP Vijaya Sai reddy satirical tweet on SEC Nimmagadda Ramesh Kumar
X

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందించారు. పంచాయతీ ఎన్నికలు జరపాలన్న పట్టుదలతో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై సెటైర్ వేశారు. "అయ్యా నిమ్మగడ్డ గారూ... హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతారా లేక చంద్రబాబు ఇంటికి వెళతారా..? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. చెప్పండి ప్లీజ్..! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story