Raghu Ramakrishnam Raju Comments: ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎంపీ రఘు రామకృష్ణంరాజు...

Raghu Ramakrishnam Raju Comments: ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎంపీ రఘు రామకృష్ణంరాజు...
x

Raghu Ramakrishnam Raju (File Photo) 

Highlights

Raghu Ramakrishnam Raju Comments | వైఎస్‌ఆర్‌సీపీ ఎంపి రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ దేవాలయాలపై దాడులను నిరసిస్తూన్నారని..

Raghu Ramakrishnam Raju Comments | వైఎస్‌ఆర్‌సీపీ ఎంపి రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ దేవాలయాలపై దాడులను నిరసిస్తూన్నారని..నేను బ్లాక్ బ్యాడ్జ్ ధరించి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటానని చెప్పారు. ఆలయ దాడులపై సిబిఐ దర్యాప్తుకు తమ పార్టీ అడ్డుపడిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో రఘురామ్ కృష్ణరాజు మీడియా సమావేశంలోమాట్లాడుతూ.. టిటిడిలో విఐపిలకు మాత్రమే డిక్లరేషన్ విధానం ఉందని, జిఓ రద్దుతో మాత్రమే దీనిని తొలగించవచ్చని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన జీఓను రద్దు చేసే అధికారం టిటిడి ఛైర్మన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుమలకు వెళ్ళినప్పుడల్లా డిక్లరేషన్ ఇవ్వమని సిఎం జగన్ ను కోరినట్లు రఘురామ కృష్ణరాజు తెలిపారు. డిక్లరేషన్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఎందుకు కష్టపడుతోందని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు, రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన రైతు భరోసా పథకం అమలులో జాప్యం జరిగిందని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే కాదు, రాష్ట్రంలో ఆలయాలపై దాడులు అగడంలేదని రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వంపై మండిపడ్డారు.


Show Full Article
Print Article
Next Story
More Stories