Andhra Pradesh: సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ ఖరారు

Movie Celebrities Meet With CM Jagan | AP News Today
x

సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ ఖరారు

Highlights

Andhra Pradesh: చిరంజీవి, నాగార్జునతో పాటు.. సీఎం జగన్‌ను కలవనున్న ట్రిపుల్ఆర్‌‌, రాధేశ్యామ్‌ సినిమాల నిర్మాతలు

Andhra Pradesh: సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ ఖరారైంది. ఈ నెల 10న సీఎంతో చిరంజీవి, నాగార్జునతో పాటు ట్రిపుల్ఆర్‌, రాధేశ్యామ్‌ సినిమాల నిర్మాతలు సమావేశం కానున్నారు. వీరితో పాటు మరికొంత మంది ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. సీఎం జగన్‌తో మంత్రి పేర్నినాని భేటీ అయ్యారు. సినిమా టికెట్ల అంశంతో పాటు కమిటీ రిపోర్టుపై సీఎం జగన్‌తో మంత్రి చర్చించారు. రేపు మరోసారి జగన్‌తో మంత్రి పేర్నినాని భేటీ కానున్నారు. ఎల్లుండి ఇండస్ట్రీ ప్రముఖుల భేటీలో చర్చించే అంశాలపై సీఎం జగన్‌తో చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories