నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన
x

నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన 

Highlights

PM Modi: నేషనల్ అకాడమీ ప్రారంభించనున్న మోడీ

PM Modi: నేడు ప్రధాని మోడీ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. పెనుగొండ నియోజకవర్గంలోని పాలసముద్రం దగ్గర ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్, కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్, అండ్ నార్కోటిక్స్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. 550 ఏకరాల్లో 1400 కోట్లతో నాసిన్ అకాడమీని కేంద్రం ఏర్పాటు చేసింది. 2022లో ప్రారంభించి.. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ప్రత్యేక దృష్టి సారించడంతో గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర అకాడమీ ఏర్పాటైంది.

కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్, నార్కొటిక్స్‌లో ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నాసిన్ అకాడమీ సేవలు అందిస్తుండగా... తాజాగా పెనుగొండలోనూ సేవలు అందించేందుకు సిద్ధమైంది. తద్వారా సత్యసాయి జిల్లా కూడా అభివృద్ధి చెందనుంది. నార్కోటిక్స్ అంశంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం చాలాసార్లు జాయింట్ ఆపరేషన్లు పూర్తి చేశాయి. కాగా.. అకాడమీ ఏర్పాటుతో దేశంలో మరిన్ని సేవలిందించేందుకు నాసిన్ సిద్ధమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories