ఏపీ సీడ్స్ వరి వంగడాల్లో బెరుకు విత్తనాలు.. స్వయంగా గుర్తించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Arun Chilukuri
Published on: 26 Oct 2020 2:33 PM IST
ఏపీ సీడ్స్ వరి వంగడాల్లో బెరుకు విత్తనాలు.. స్వయంగా గుర్తించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
X

విత్తనాల్లో మోసాలు రైతులే కాదు సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా చూశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన నేతే కాకుండా స్వయంగా పొలంలో దిగి వ్యవసాయ పనులు చేస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బెరుకు విత్తనాలు గుర్తించారు. ఏపీ సీడ్స్ దగ్గర కొనుగోలు చేసిన వరి వంగడాల్లో బెరుకు విత్తనాలు పంటల్లో ఉన్నాయని చెప్పారు. గుంటూరు వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. వ్యవసాయ శాస్త్ర వేత్తలు బెరుకు విత్తనాలను పరిశీలించారని త్వరలో రిపోర్టు ఇస్తామన్నారని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. విత్తనాలు సరఫరా చేసిన మంజీరా సీడ్ కంపెనీపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story