Payakaraopeta: ఎమ్మెల్యే చేతుల మీదుగా పోలీసులకు బియ్యం అందజేత

Payakaraopeta: ఎమ్మెల్యే చేతుల మీదుగా పోలీసులకు బియ్యం అందజేత
x
Highlights

స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందికి రైస్ మిల్లు ఓనర్ పచ్చిగోళ్ళ రాజబాబు ఆర్దిక సహాయంతో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చేతులమీదుగా బుధవారం బియ్యం అందజేశారు.

పాయకరావుపేట: స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందికి రైస్ మిల్లు ఓనర్ పచ్చిగోళ్ళ రాజబాబు ఆర్దిక సహాయంతో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చేతులమీదుగా బుధవారం బియ్యం అందజేశారు. సుమారు 25 మంది సిబ్బందికి 25 కేజీలు కేజీల చొప్పున బియ్యంను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబురావు మాట్లాడుతూ... కరోనా మహమ్మారి కట్టడికై పగలూ-రాత్రి నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న పోలీసుల కష్టాన్ని చూసి మానవతా దృక్పథంతో ముందుకొచ్చి సహాయం అందించిన రాజబాబు అభినందనీయులని అన్నారు.

రాజబాబుని ఆదర్శంగా చూసి మరికొంత మంది దాతలు ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్న మనందరినీ కరోనా నుండి మనందరినీ రక్షించడానికి కుటుంబాలకు దూరంగా నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు తనవంతు సహాయంగా వీటిని అందించడం జరిగిందని రాజబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ధనిశెట్టి బాబురావు, దగ్గుపల్లి సాయిబాబా, గూటూరి శ్రీను, కాదా రామకృష్ణ ఎస్ ఐ విభీషణరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories