కనెక్ట్ టు ఆంధ్రా : తన ఐదేళ్ల జీతాన్ని విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

alla ramakrishna reddy
x
alla ramakrishna reddy
Highlights

రాష్ట్ర ప్రగతి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ 'కనెక్ట్ టు ఆంధ్రా' అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. అయితే దీనికిగాను వైసీపీ, మంగళగిరి...

రాష్ట్ర ప్రగతి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ 'కనెక్ట్ టు ఆంధ్రా' అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. అయితే దీనికిగాను వైసీపీ, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఐదేళ్ల పాటు శాసనసభ్యుడి హోదాలో తాను అందుకునే జీతం, ఇతర భత్యాలు, సదుపాయాలకి గాను అయ్యే మొత్తం ఖర్చును 'కనెక్ట్ టు ఆంధ్రా'కు విరాళంగా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న పథకాలకి గాను తన వంతుగా కృషి చేస్తున్నట్లు అయన తెలిపారు. తాను విరాళంగా ఇస్తున్ననన్నది అసెంబ్లీ కార్యదర్శికి లిఖితపూర్వకంగా అందజేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇదే విషయాన్ని ఆ పార్టీ సోషల్ మీడియా ద్వారా అధికారకంగా కూడా ప్రకటించింది.


"రాష్ట్ర అభివృద్ధి కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన జీత‌భ‌త్యాన్ని మొత్తం 'కనెక్ట్‌ టు ఆంధ్రా'కు ఇస్తున్న‌ట్లు అసెంబ్లీ కార్యదర్శికి లిఖితపూర్వకంగా లేఖ అందజేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు తనవంతు సాయంగా తనకు వచ్చే జీతభత్యాలను మొత్తం ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తున్నట్లు ఆర్కే చెప్పారు."


Show Full Article
Print Article
More On
Next Story
More Stories