కృష్ణా జిల్లాలో సంచలనం రేపుతోన్న మహిళ అదృశ్యం

కృష్ణా జిల్లాలో సంచలనం రేపుతోన్న మహిళ అదృశ్యం
x
Highlights

కృష్ణా జిల్లాలో మహిళ అదృశ్యం సంచలనం రేపుతోంది. ఈ నెల 16న కువైట్ నుంచి వచ్చిన దుర్గ కనిపించకుండా పోయింది. దాంతో బాధిత కుటుంబం గన్నవరం పోలీసులను...

కృష్ణా జిల్లాలో మహిళ అదృశ్యం సంచలనం రేపుతోంది. ఈ నెల 16న కువైట్ నుంచి వచ్చిన దుర్గ కనిపించకుండా పోయింది. దాంతో బాధిత కుటుంబం గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. గన్నవరానికి చెందిన సాలసత్తి దుర్గ రెండేళ్ల క్రితం కువైట్ వెళ్లింది. ఈ నెల 16న దుర్గ ఇండియాకు తిరిగి వచ్చింది. గన్నవరం విమానాశ్రయం టెర్మినల్ బయటకు వచ్చినట్టు వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి సహాకారంతో విమానాశ్రయంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. అయితే అందులో టెర్మినల్ నుంచి బయటకు వచ్చినట్టు గుర్తించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories