చంద్రబాబుపై మంత్రి రంగనాథరాజు తీవ్ర విమర్శలు

Arun Chilukuri
Published on: 29 Dec 2020 5:42 PM IST
చంద్రబాబుపై మంత్రి రంగనాథరాజు తీవ్ర విమర్శలు
X

ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే ప్రతిపక్ష నేత అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి రంగనాథరాజు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇల్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రంగనాథరాజు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబు భవిష్యత్తులో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేసి పేదల పొట్టగొడుతున్నారని ఆరోపించారు. 14 సంవత్సరాల్లో ఒక్క సెంట్ భూమి కూడా సేకరించి పేదలకు ఇవ్వని చంద్రబాబు, ప్రభుత్వం చేపట్టని పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రజలు అంతాగమనిస్తున్నారని మంత్రి రంగనాథరాజు అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story