Nara Lokesh: ఏయూలో విద్యార్థుల ఆందోళనపై అసెంబ్లీలో స్పందించిన మంత్రి లోకేష్

Nara Lokesh: ఆంధ్ర యూనివర్సిటీ (AU) లో విద్యార్థుల ఆందోళనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో స్పందించారు.

Arun Chilukuri
Published on: 26 Sept 2025 2:39 PM IST
Nara Lokesh: ఏయూలో విద్యార్థుల ఆందోళనపై అసెంబ్లీలో స్పందించిన మంత్రి లోకేష్
X

Nara Lokesh: ఆంధ్ర యూనివర్సిటీ (AU) లో విద్యార్థుల ఆందోళనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో స్పందించారు. విద్యార్థులు లేవనెత్తుతున్న సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాటిని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు.

మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. "ఆంధ్ర యూనివర్సిటీని దేశంలోనే టాప్ 100 యూనివర్సిటీల్లో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం." అని పేర్కొన్నారు. గతంలో విశ్వవిద్యాలయాల్లో జరిగిన అవకతవకలపై ఒక కమిటీ వేస్తామని, ఆ కమిటీ 100 రోజుల్లోపు రిపోర్ట్ సమర్పించిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

తాజా ఆందోళనల సందర్భంగా నిన్న ఏయూలో ఫిట్స్ వచ్చి ఓ విద్యార్థి చనిపోయాడని లోకేష్ తెలిపారు. అయితే, ఆ విద్యార్థిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం సరికాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థులు చర్చలకు వస్తే వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story