చంద్రబాబుపై మంత్రి కొడాలి మండిపాటు
* ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు డ్రామాలు -కొడాలి నాని
File Image
మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి 5 వందల పంచాయతీలు కూడా రాలేదన్న ఆయన ప్రజల దృష్టిని మరల్చడానికే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపును చంద్రబాబు, నిమ్మగడ్డ అడ్డుకోలేరని అన్నారు నాని. స్థానిక ఎన్నికలు అయిపోయేలోపు చంద్రబాబు, లోకేష్ను టీడీపీ కార్యకర్తలు కొడతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయిందని, ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి ఆయనను తరలించాలని కొడాలి నాని అన్నారు.
Next Story




