Vizag Steel Plant: కేంద్రంతో రాజీపడితే పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నిస్తాం: మంత్రి కన్నబాబు
ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )
Vizag Steel Plant: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు మంత్రి కురసాల కన్నబాబు. ఇదే విషయాన్ని కేంద్రం కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినా.. టీడీపీ, జనసేనలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దీనిపై సమాధానం చెప్పాల్సిన బీజేపీ కూడా కనిపించడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఒకవేళ కేంద్రంతో రాజీపడితే పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నిస్తామన్నారు మంత్రి కన్నబాబు.
Next Story




