పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతుంది: మంత్రి బొత్స

Arun Chilukuri
Published on: 14 Feb 2021 4:04 PM IST
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతుంది: మంత్రి బొత్స
X

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతుంది: మంత్రి బొత్స

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు అంకెల గారడీ చేస్తున్నారని మండి పడ్డారు మంత్రి బొత్స. మొదటి విడత ఫలితాల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందిందని మంత్రి స్పష్టం చేశారు. రెండో విడతలోనూ 539 ఏకగ్రీవాలు ఉన్నాయని.. 3 వేల 328 పంచాయతీల్లో 2 వేల 639 మంది వైసీపీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారన్నారు. రాబోయే రెండు దశల్లోనూ ఇదే స్థాయిలో స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అభ్యర్థుల గెలుపునకు కారణమన్నారు మంత్రి బొత్స. ఎస్‌ఈసీ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story