గౌతం రెడ్డి వారసుడిని ప్రకటించిన మేకపాటి...

Mekapati Goutham Reddy: ఇటీవ‌లే గుండెపోటుకు గురై మేకపాటి గౌతంరెడ్డి మరణించడంతో ఆయన వారసుడిగా తన రెండో కుమారుడిని నిర్ణయించినట్లు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ప్రకటించారు.

Arun Chilukuri
Updated on: 28 April 2022 9:15 PM IST
Mekapati Vikram Reddy Meets cm jagan
X

గౌతం రెడ్డి వారసుడిని ప్రకటించిన మేకపాటి...

Mekapati Goutham Reddy: ఇటీవ‌లే గుండెపోటుకు గురై మేకపాటి గౌతంరెడ్డి మరణించడంతో ఆయన వారసుడిగా తన రెండో కుమారుడిని నిర్ణయించినట్లు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల షెడ్యూలు వస్తే మిగతా విషయాలు బయటకు ప్రకటిస్తామన్నారు. షెడ్యూల్ వచ్చిన తర్వాతే ఎవరెవరు పోటీలో ఉంటారో తెలుస్తోందన్నారు. నియోజకవర్గానికి వెళ్లే ముందు సీఎం జగన్ ఆశీస్సులు తీసుకోవడానికి విక్రమ్ ని తీసుకొచ్చినట్లు మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. అన్న వారసుడిగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు మేకపాటి విక్రం. అన్నయ్య ఆశయాలను ముందుకు తీసుకువవెళ్తానన్నారు. నియోజకవర్గానికి అన్న చేయాలనుకున్నది తాను చేసి చూపిస్తానని నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story