రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Highlights
మండలంలో కొండలఅగ్రహారం పెట్రోల్బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.
S. Srikanth3 Dec 2019 4:59 AM GMT
మాకవరపాలెం: మండలంలో కొండలఅగ్రహారం పెట్రోల్బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామానికి చెందిన మాకిరెడ్డి రాంబాబు (45) తన అత్తను పింఛను తీసుకునేందుకు లచ్చన్నపాలెం ఉదయం ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో కొండల అగ్రహారం వచ్చి ఇక్కడి బంకులో పెట్రోల్ పోయించి బయటకు వస్తున్నాడు.
ఈ సమయంలో నర్సీపట్నానికి చెందిన కె.శివ (30) ఎదురుగా వాహనంపై వస్తూ బలంగా ఢీకొట్టాడు. దీంతో రాంబాబు కింద పడిపోవడంతో తలకు తీవ్రమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో శివ కూడా గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి నర్సీపట్నం తరలించారు.
Web TitleMan died in road accident in Makavarapalem
లైవ్ టీవి
ప్రయాణికులకు మరింత చేరువ కానున్న హైదరాబాద్ మెట్రో
15 Dec 2019 5:07 PM GMTమొదటి వన్డేలో భారత్ ఓటమి
15 Dec 2019 4:38 PM GMTరాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల నోటీసులు
15 Dec 2019 4:19 PM GMTత్వరలోనే రామ్ చరణ్ తో సినిమా ఉంటుంది : పవన్ కళ్యాణ్
15 Dec 2019 3:57 PM GMTజనగామ జిల్లాలో మంత్రులను అడ్డుకున్న మహిళలు
15 Dec 2019 3:34 PM GMT