Mallu Ravi: ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి.. సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాం

Mallu Ravi: 30 రోజుల పరిపాలన పూర్తికాకముందే ప్రతిపక్ష బీఆర్ఎస్‌ బుక్‌లెట్ రిలీజ్ చేసింది

Shekhar G
Updated on: 7 Jan 2024 8:45 PM IST
Mallu Ravi Comments On BRS
X

Mallu Ravi: ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి.. సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాం

Mallu Ravi: తెలంగాణలో 30 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి. 30 రోజుల పరిపాలన పూర్తి కాకముందే ప్రతిపక్ష బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బుక్‌లెట్ రిలీజ్ చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి.. పాలనను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు మల్లు రవి. గత నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారని అన్నారు. నెల రోజుల్లోనే ప్రత్యేకమైన పాలన ముద్రను ప్రజలకు అందించి సకలజనుల మెప్పు పొందారని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story