విశాఖ : లేట్‌రైట్ ఖనిజంపై మాఫియా కన్ను

విశాఖ : లేట్‌రైట్ ఖనిజంపై మాఫియా కన్ను
x
Highlights

ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వచ్చినా వారి తలరాత మాత్రం మారడం లేదు. పచ్చని అడవులను నాశనం చేస్తున్నారు. విశా‌ఖ జిల్లా అడవుల్లో ఉన్న లేట్ రైట్ పైన...

ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వచ్చినా వారి తలరాత మాత్రం మారడం లేదు. పచ్చని అడవులను నాశనం చేస్తున్నారు. విశా‌ఖ జిల్లా అడవుల్లో ఉన్న లేట్ రైట్ పైన మాఫియా కన్ను పడింది. ఈ విలువైన ఖనిజాన్ని తవ్వేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గిరిజనుల పేరు మీదుగా అనుమతులు పొంది లబ్ధి పొందాలని చూస్తున్నారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సరుగుడు పంచాయితీ పరిధిలో లేట్ రైట్ ఖనిజం అపారంగా ఉంది. ఈ భూములపై చట్ట పరమైన హక్కులు, రాజ్యాగ పరమైన రక్షణలు ఈ పంచాయితీ గిరిజనులకు ఉన్నాయి. ఇక్కడ వున్న లేట్ రైట్ తవ్వేందుకు తప్ప గిరిజన చట్టాల అమలు, వారి సంక్షేమం ఏ ప్రభుత్వనికి పట్టడం లేదు.

అయితే ప్రస్తుతం సరుగుడు పంచాయతీలో కొత్త దద్దుగులలో సర్వే నెంబరు 533లోని 22హెక్టార్లలో ఉన్న లేట్ రైట్ తవ్వకాలకు అనుమతుల మంజూరుకు ప్రయత్నం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఈ మారుమూల ప్రాంతంలోకి జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పర్యటించడం అనుమానాలకు తావిస్తుంది. ఈ అనుమతులు కోసం గిరిజనుడైన ఒక వ్యక్తి పేరున దరఖాస్తు పెట్టించారని అక్కడి వారు చెప్తున్నారు.

అసలు ఈ తవ్వకపు అనుమతులు పొందాలంటే పిసా చట్టం ప్రకారం గ్రామ సభ అనుమతి, అటవి హక్కుల చట్టం గ్రామ కమిటి అమోదం తప్పని సరిగా ఉండాలి. కానీ, కాంట్రాక్టర్లు అవేమీ పట్టించుకోకుండా బినామీల పేరు మీదుగా ఈ మైనింగ్‌ను తవ్వి ఖజనా నింపుకోవాలని చూస్తున్నారు. అభివృద్ధి మాటే ఎరుగని గిరిజనులకు మైనింగ్ మాఫియా చుక్కలు చూపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అడవిని నాశనం చేసే మైనింగ్ తవ్వకాలు జరిపితే తాము ఊరుకోమని ఆదివాసులు తెగేసి చెప్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories