దస్తావేజుల తయారీపై అవగాహన సదస్సు

దస్తావేజుల తయారీపై అవగాహన సదస్సు
x
Highlights

ఆస్తి క్రయ,విక్రయదారులు తమ దస్తావేజులను ఇంటర్ నెట్ లో స్వయంగా తయారు చేసుకునే విధానం పై కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని సభా భవనంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు.

కడప: ఆస్తి క్రయ,విక్రయదారులు తమ దస్తావేజులను ఇంటర్ నెట్ లో స్వయంగా తయారు చేసుకునే విధానం పై కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని సభా భవనంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలనుండి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు డిఐజి ఉదయ భాస్కర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి సాధారణ ప్రజలు, న్యాయవాదులు, స్థిరాస్తి వ్యాపారులు, బ్యాంకు అధికారులు, గణాంక నిపుణులు తదితరులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ప్రజలను కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories