ఓ నిండు ప్రాణాన్ని పాశవికంగా చిదిమేశాడు.. చివరికి ఎలా చిక్కాడంటే..!

ఓ నిండు ప్రాణాన్ని పాశవికంగా చిదిమేశాడు.. చివరికి ఎలా చిక్కాడంటే..!
x

ఓ నిండు ప్రాణాన్ని పాశవికంగా చిదిమేశాడు.. చివరికి ఎలా చిక్కాడంటే..!

Highlights

Tirupati: ఒకవైపు కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే మరోవైపు ఇదే అదునుగా కొంతమంది రెచ్చిపోతున్నారు.

Kadapa: ఒకవైపు కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే మరోవైపు ఇదే అదునుగా కొంతమంది రెచ్చిపోతున్నారు. కోవిడ్ సోకినవారి పట్ల మానవత్వంతో ఉండాల్సిన వారే ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారు. కరోనా బారిన పడి చనిపోయారంటూ తమ వారిని నమ్మిస్తున్నారు. హాస్పిటల్ వారు డెడ్‌బాడిని ఇవ్వడం లేదని కట్టుకథలు చెప్తున్నారు. అసలు విషయం బయటపడ్డాక కటకటల్లోకి వెళ్తున్నారు. రీసెంట్‌గా ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో వనస్థలిపురంలో ఒకటి చోటు చేసుకోగా మరొకటి తిరుపతిలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి భర్త చేతుల్లోనే మగువలు ప్రాణాలు వదులుతున్నారు.

తిరుపతిలో ఈనెల 23న వెలుగులోకి వచ్చిన సూట్‌కేసులో కాలిన మృతదేహ కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ఆధారాలను పోలీసులు సేకరించారు. మహిళ భర్త శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ సమీపంలో నిందితుడు శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఓప్పుకున్నట్టు తెలుస్తోంది. మిస్టరీలో సీసీ కెమెరాల ఫుటేజీ కీలకంగా మారింది. సీసీ కెమెరాల్లో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఒక చేత్తో పాపను ఎత్తుకొని మరొ చేత్తో భార్య మృతదేహం ఉన్న సూట్‌కేసును పట్టుకుని వెళ్లి కాల్చేశాడు.

కడప జిల్లా బద్వేలుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి చిత్తూరు జిల్లా రామ సముద్రానికి చెందిన భువనేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భువనేశ్వరి హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తోంది. కరోనావల్ల వర్క్‌ ఫ్రం హోం ఇవ్వడంతో మూడు నెలల కిందట వీరు తిరుపతి వచ్చి డీబీఆర్ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంటులో ఏడాదిన్నర వయసు పాపతో కలిసి ఉంటున్నారు. పెళ్లైనప్పటి నుంచి దంపతుల మధ్య మనస్పర్థలు ఉండేవని తెలుస్తోంది. అయితే ఈనెల 22 నుంచి భువనేశ్వరి ఫోన్ పని చేయకపోవడంతో పుట్టింటి వారికి అనుమానం వచ్చి శ్రీకాంత్‌రెడ్డిని నిలదీశారు.

భువనేశ్వరి తల్లిదండ్రులకు కట్టు కథలు చెప్పాడు. ఆమెకు డెల్టా‌ప్లస్ వేరియంట్‌ కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చించినట్లు అక్కడి ఆమె చనిపోవడంతో తనకూ చూపించకుండా దహనక్రియలు చేసినట్టు చెప్పి వారిని నమ్మించాడు. అయితే భువనేశ్వరి అక్క పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. భువనేశ్వరి నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అందులో శ్రీకాంత్‌రెడ్డి సూటుకేసు తీసుకుని బయటకు వెళ్లి తిరిగి అదే సూటుకేసుతో ఇంటికి చేరడంతో పోలీసుల అనుమానం అతడిపైకి వెళ్లింది దాంతో అనుమనంతో అతడిని విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories