ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్ గోస్వామి

Arun Chilukuri
Published on: 16 Dec 2020 5:55 PM IST
ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్ గోస్వామి
X

దేశవ్యాప్తంగా పలువురు సీజేలతో పాటు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్ గోస్వామి నియామకమయ్యారు. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా గోస్వామి ఉన్నారు. గోస్వామి నియామకంతో ఏపీ హైకోర్టు సీజే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ అయ్యారు. అలాగే.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న హిమా కోహ్లీకి పదోన్నతి లభించింది. తెలంగాణ హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ నియమించబడ్డారు. దీంతో తెలంగాణ హైకోర్టు సీజే చౌహాన్‌ ఉత్తరాఖండ్‌కు బదిలీ అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story