Judges Transfer in Andhra Pradesh: జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు బదిలీలు..22లోపు చేరాలని ఆదేశం!

Judges Transfer in Andhra Pradesh: జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు బదిలీలు..22లోపు చేరాలని ఆదేశం!
x
AP High Court (File Photo)
Highlights

Judges Transfer in Andhra Pradesh: కరోనా వైరస్ వ్యాప్తితో అతలాకుతమైన వ్యవస్థలతో ఇప్పటికే హైకోర్టు సైతం మధ్యంతరంగా సెలవులు ప్రకటిస్తూనే ఉంది.

Judges Transfer in Andhra Pradesh: కరోనా వైరస్ వ్యాప్తితో అతలాకుతమైన వ్యవస్థలతో ఇప్పటికే హైకోర్టు సైతం మధ్యంతరంగా సెలవులు ప్రకటిస్తూనే ఉంది. అత్యవసర కేసులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో సివిల్ జడ్జిలకు బదిలీ ప్రక్రియ చేపట్టింది.

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. మరోవైపు ఏపీలో, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 151 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు హైకోర్టు బదిలీలు, పోస్టింగ్‌లు కల్పించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ నెల 15 లోపు రిలీవ్‌ కావాలని, 22 లోపు నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమ నిధికి 2020-21 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా రూ.25 కోట్లు విడుదల చేసింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న న్యాయవాదుల సంక్షేమం కోసం దీనిని ఖర్చు చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories