TDP-Janasena: ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసిన టీడీపీ

Joint Manifesto Committee Formed By TDP
x

TDP-Janasena: ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసిన టీడీపీ

Highlights

TDP-Janasena: జనసేన నుంచి వర ప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ లకు చోటు

TDP-Janasena: రాబోయే ఎన్నికల్లో కలిసి వెళ్లాలని టీడీపీ-జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ నిర్ణయించారు. అందులో భాగంగా ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ-జనసేన సమన్వయ కమిటీలు రెండు సార్లు సమావేశం అయ్యాయి. ఉమ్మడిగా పూర్తిస్తాయి మేనిఫెస్టో రూపకలప్పనే ప్రధాన అజెండా రెండో సమావేశం జరిగింది. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోగా..ఇప్పుడు టీడీపీ – జనసేన జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు.

మొత్తం ఆరుగురు సభ్యులతో టీడీపీ – జనసేన జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభిలకి చోటు దక్కగా..జనసేన పార్టీ నుంచి వర ప్రసాద్, ముత్తా శశిధర్, శరత్‌ను ఎంపిక చేశారు. ఈ నెల 13వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై టీడీపీ – జనసేన జేఏసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories