
Jogi Ramesh: టీడీపీ, జనసేన కలవడం పాయిజన్తో సమానం
Jogi Ramesh: 2024 తర్వాత పవన్కల్యాన్తో సినిమా తీస్తా
Jogi Ramesh: జనసేన అధినేత పవన్కల్యాన్పై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీ కలయిక ఓ వైరస్ లాంటిదని.. చంద్రబాబు, పవన్లు కలవడం పాయిజన్తో సమానమంటూ ఆరోపించారు. ప్రజలకు పవన్పై విశ్వసనీయత లేకనే రెండు చోట్ల ఓడించారని ఆరోపించారు. పవన్ సభకు పట్టుమని 2 వేల మందికూడా రాలేదని విమర్శించారు. 2024 తర్వాత పవన్కల్యాన్తో సినిమా తీస్తానంటూ సవాల్ చేశారు మంత్రి జోగి రమేష్. జానీ-కూనీ, గబ్బర్సింగ్-రబ్బర్సింగ్ సినిమాలు తీస్తానని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత పవన్ సినిమాలకే పరిమితం అవుతారని జోస్యం చెప్పారు మంత్రి జోగి రమేష్.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




