Janasena Party: జన సేనాని కొత్త నినాదం.. స్వదేశీ వస్తువులే వాడాలని పిలుపు

Janasena Party: జన సేనాని కొత్త నినాదం.. స్వదేశీ వస్తువులే వాడాలని పిలుపు
x
Highlights

Janasena Party: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు.

Janasena Party: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నినాదం పాతదే అయినా మరలా మరోసారి దీన్ని యువత మొత్తం ఆచరించేలా జనసేనాని అందుకున్నారు. ఈ వినాయక చవితి నుంచే దీన్ని ప్రారంభించాలని పిలుపు నిచ్చారు.

కొత్త నినాదం ఎత్తుకుంది జనసేన. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులే వాడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. వినాయక చవితి నుంచి ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లుగా ప్రకటించారు. పండుగ కోసం ఏ వస్తువు కొన్నా.. అది ఎక్కడ తయారైందో చూడాలన్నారు. మన ఉత్పత్తుల గిరాకీ కోసమే స్వదేశీ నినాదమని పవన్‌ స్పష్టం చేశారు. 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' నినాదం ఏ ఒక్క వర్గానికో కాదని..దేశ ప్రజలందరి అభివృద్ధికి సంబంధించినదని అన్నారు.

'మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి..' ఇదే 'ఆత్మనిర్భర భారత్‌' అని పవన్‌ అభివర్ణించారు. అందుకే ఈ వినాయక చవితి నుంచే ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని జనసేన- భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నిర్ణయించాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఆయన పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు

Show Full Article
Print Article
Next Story
More Stories