తిరుమల శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్
తిరుమల శ్రీవారిని జనసేన అధినేత పవన్కల్యాణ్ దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఆలయంలో గడిపారు పవన్కల్యాణ్. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పవన్కల్యాణ్కు వేదాశీర్వచనం పలికారు వేదపండితులు. పట్టువస్త్రంతో సత్కరించారు ఆలయాధికారులు. గతేడాది జనవరి నుంచి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నానని కరోనా వల్ల కుదరలేదని స్పష్టం చేశారు. శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు పవన్కల్యాణ్.
Next Story




