Janasena Chief Pawan Kalyan About Disha Act: దిశ చట్టం... ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు ఏమయ్యాయి : జనసేనాని

Janasena Chief Pawan Kalyan About Disha Act: దిశ చట్టం... ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు ఏమయ్యాయి : జనసేనాని
x
Pawan Kalyan (File Photo)
Highlights

Janasena Chief Pawan Kalyan About Disha Act: తూర్పు గోదావరి జిల్లాలో కోరుకొండ మండలానికి చెందిన ఓ బాలికపై సామూహిక అత్యాచార ఘటన పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

Janasena Chief Pawan Kalyan About Disha Act: తూర్పు గోదావరి జిల్లాలో కోరుకొండ మండలానికి చెందిన ఓ బాలికపై సామూహిక అత్యాచార ఘటన పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనని విడుదల చేశారు. రాజమహేంద్రవరంలో కుటుంబ పోషణ కోసం ఓ దుకాణంలో పని చేస్తున్న 16ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారనే వార్త తీవ్రంగా కలచివేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అమానుషకరమైన ఈ ఘటన హృదయం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని, నాలుగు రోజులపాటు చిత్ర హింసలకు గురి చేసిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలని పవన్ పేర్కొన్నారు.

తన కుమార్తె ఆచూకీ తెలియడం లేదని తల్లి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసిన సకాలంలో స్పందించలేదని తెలిసింది. మహిళలపై అత్యాచారాలు నిరోధానికి తీసుకువచ్చిన దిశ చట్టం ఏమైపోయింది? అసెంబ్లీలో ముక్తకంఠంతో ఆమోదం పొందిన ఆ చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదు? తొలి దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటైన రాజమహేంద్రవరంలోనేసామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకొంది. దిశ పేరుతో ఏర్పాటైన ఆ ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు ఏం చేస్తున్నాయని పవన్ ప్రశ్నించారు.

ఈ సామూహిక అత్యాచారం వెనక గంజాయి, డ్రగ్స్‌ ముఠాలు ఉన్నాయని ఇది ట్లేడ్‌ బ్యాచ్‌ పనే అని ఆ నగరవాసులు ఆందోళన చెందుతున్న విషయాన్ని పోలీస్‌ అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని, అలాంటి ముఠాల ఆగడాలకు, కళ్ళెం వేయకపోతే రక్షణ కరవవుతుంది. చట్టం చేయడం కాదు.. వాటిని నిబద్ధతతో అమలు చేస్తేనే మహిళలకు రక్షణ కలుగుతుందని పవన్ పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories