YS Jagan: భవానీపురం జోజీనగర్‌ బాధితుల వద్దకు వైఎస్‌ జగన్‌

YS Jagan: ఇవాళ విజయవాడ భవానీపురానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లనున్నారు.

Arun Chilukuri
Published on: 16 Dec 2025 11:33 AM IST
YS Jagan: భవానీపురం జోజీనగర్‌ బాధితుల వద్దకు వైఎస్‌ జగన్‌
X

YS Jagan: భవానీపురం జోజీనగర్‌ బాధితుల వద్దకు వైఎస్‌ జగన్‌

YS Jagan: ఇవాళ విజయవాడ భవానీపురానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో భవానీపురంలో 42 ప్లాట్లను అధికారులు కూల్చివేశారు. ఈ నేపథ్యంలో జగన్ ను కలిసిన బాధితులు.. తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. దీంతో.. ఇవాళ విజయవాడలో జగన్ పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి భవానీపురానికి వెళ్లి.. 42 ఇళ్ల కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం.. బాధితులను ఆయన పరామర్శిస్తారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు 42 ప్లాట్ల బాధితులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు జగన్ కూడా వారిని కలుస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story