Independence Day 2020: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్
Independence Day 2020: 74వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై కంటిజంట్స్ను సీఎం జగన్ పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైఎస్ జగన్ వీక్షించారు. సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Next Story




