Srisailam: శ్రీశైలం జలాశయంలో పెరిగిన నీటిమట్టం

Increased Water Level in Srisailam Reservoir
x

శ్రీశైలం జలాశయం (ఫైల్ ఇమేజ్)

Highlights

Srisailam: వారం రోజుల్లో 5 అడుగులు పెరిగిన నీటిమట్టం * ఆగస్టు మొదటి వారం నాటికి శ్రీశైలం డ్యామ్‌ నిండుకునే అవకాశం

Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. వారం రోజుల్లో 5 అడుగుల నీటి మట్టం పెరిగింది. ఎగువనున్న జూరాల జలాశయంలోని విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేసి ఈ నీటిని దిగువనున్న శ్రీశైలం జలాశయానికి 10, 693 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి ప్రవాహం ఇలానే కొనసాగితే ఆగస్టు మొదటి వారం నాటికి శ్రీశైలం డ్యామ్‌ నిండుకుండాను తలపించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories