వల్లభనేని వంశీ దారెటు..?

వల్లభనేని వంశీ దారెటు..?
x
Highlights

టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుడ్‌బై చెప్పారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. ఇన్నాళ్లు టీడీపీకి విధేయుడిగా పని చేశానన్నారు వంశీ....

టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుడ్‌బై చెప్పారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. ఇన్నాళ్లు టీడీపీకి విధేయుడిగా పని చేశానన్నారు వంశీ. స్థానిక వైసీపీ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుచరులను కాపాడుకోవటానికే రాజకీయాల నుండి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రత్యామ్నాయాలు ఉన్నా తన మనసు అంగీకరించకపోవడంతో ఆ మార్గాలను ఆశ్రయించలేదంటున్నారు వంశీ.

ఎమ్మెల్యే వంశీ తాజా నిర్ణయం ఇప్పుడు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే టీడీపీకి రాజీనామా చేసిన వంశీ వైసీపీలో చేరతానని మాత్రం ప్రకటించలేదు. వైసీపీలో చేరే ఆలోచనను విరమించుకున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు వంశీ రాకను యార్లగడ్డ, ఆయన అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్‌తో సమావేశమైన రోజే సుజనాచౌదరితోనూ వంశీ సుదీర్ఘ మంతనాలు జరిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories