ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా..

*గుంటూరు జిల్లా కలెక్టర్‌గా వివేక్ యాదవ్ *ఎస్‌ఈసీ ఉత్తర్వుల మేరకు వివేక్ యాదవ్ నియామకం *ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా రజత్ భార్గవ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు

Arun Chilukuri
Updated on: 3 Feb 2021 7:22 PM IST
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా..
X

Emblem of Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఎస్‌ఈసీ ఉత్తర్వుల మేరకు వివేక్ యాదవ్‌ను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా వివేక్ యాదవ్‌ను నియమిస్తూ సీఎస్ జీవో ఇచ్చారు. అలాగే, ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా రజత్ భార్గవ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. టూరిజం, యువజనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ రజత్ భార్గవ్‌కు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌గా వై.శ్రీలక్ష్మికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం.... పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీగా విజయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story