T G Bharath: కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా

T G Bharath: ప్రజలతో మమేకమవుతూ సైకిల్ యాత్ర భారత్ భరోసా

Shashank Gullapelli
Published on: 19 April 2024 8:17 AM IST
I Entered Politics To Develop The City Of Kurnool Says T G Bharath
X

T G Bharath: కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా

T G Bharath: క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్. ఎస్.ఏ.పీ క్యాంపు వ‌ద్ద నుండి న‌గ‌ర వీధుల్లో సైకిల్ తొక్కుతూ ప్రజ‌ల‌కు అభివాదం చేస్తూ కొత్త బ‌స్టాండ్, ఇందిరాగాంధీ న‌గ‌ర్ ఆర్చి, సీతారాం న‌గ‌ర్ ఆటో స్టాండ్, పంప్ హౌస్ పాల‌కొట్టాలు, అశోక్ న‌గ‌ర్, న‌ర‌సింహారెడ్డి న‌గ‌ర్, ఆర్.ఎస్ రోడ్డు స‌ర్కిల్, బంగారుపేట మీదుగా మౌర్య ఇన్ చేరుకున్నారు. ఈ సైకిల్ యాత్రకు ప్రజ‌ల నుండి విశేష స్పంద‌న ల‌భించింది. జరుగనున్న ఎన్నిక‌ల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల‌ని భ‌ర‌త్ ప్రజ‌ల‌ను కోరారు. క‌ర్నూలు న‌గ‌రంలో ఎటు చూసినా స‌మ‌స్యలే ఉన్నాయ‌న్నారు... ఒక అవకాశం ఇచ్చి త‌న‌ను గెలిపిస్తే ఐదేళ్లలో త‌న ఆరు గ్యారెంటీలు అమ‌లు చేసి ప్రజ‌ల‌కు 20 ఏళ్ల అభివృద్ధి ఇస్తాన‌ని భ‌ర‌త్ హామీ ఇచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story