తిరుమలకు భారీగా పెరిగిన భక్తుల రద్దీ

Tirumala: శ్రీవారి సేవా సదన్ వరకు నిండిన క్యూలైన్లు, క్యూలైన్లు పెరుగుతున్నా తగ్గని భక్తుల రద్దీ

Jyothi
Published on: 12 Jun 2022 7:02 AM IST
Huge Rush Continue at Tirumala
X

తిరుమలకు భారీగా పెరిగిన భక్తుల రద్దీ

Tirumala: తిరుమలకు శ్రీవారి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఒకవైపు వీకెండ్. మరోవైపు రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానుండడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. వైకుంఠం, నారాయణగిరి క్యూకాంప్లెక్స్‌లు అన్ని భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సేవా సదన్ వరకు క్యూలైన్లలో భక్తులు నిలబడి ఉన్నారు. క్యూలైన్లుపెరుగుతున్నా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు.

Jyothi

Jyothi

Next Story