ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ సర్కార్ .. చరిత్రలోనే ఇది తొలి సారి అన్న మంత్రి కన్నబాబు..

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ సర్కార్ .. చరిత్రలోనే ఇది తొలి సారి అన్న మంత్రి కన్నబాబు..
x
Highlights

సుదీర్ఘ కాలంగా పోరాటాలు చేస్తున్న అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామికి అనుగుణంగా...

సుదీర్ఘ కాలంగా పోరాటాలు చేస్తున్న అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామికి అనుగుణంగా డిపాజిట్‌దార్ల కోసం 265 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 3 లక్షల 69 వేల 6 వందల 55 మంది డిపాజిట్ దార్లకు ఈ డబ్బు అందజేయనున్నారు. 10 వేల రూపాయల లోపు ఉన్న డిపాజిట్లకు తొలుత చెల్లింపులు చేయనున్నారు.

ఆర్ధిక పరిస్ధితి సహకరించకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామికి అనుగుణంగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు రెండు లక్షల కోట్లు అప్పు చేసి 65 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు పెట్టినా సీఎం జగన్ ఖాతాదారుల కోణంలో ఆలోచించి న్యాయం చేశారన్నారు. ప్రయివేటు సంస్ధ సేకరించిన డిపాజిట్లను ప్రభుత్వం చెల్లించడం చరిత్రలోనే ఇది తొలి సారి అని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories