ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

*ఇళ్ల పట్టాల పంపిణీ జవనరి నెలాఖరు వరకూ పొడగింపు *వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంపై సీఎం సమీక్ష *90 రోజుల్లోగా పట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశం

Arun Chilukuri
Published on: 20 Jan 2021 9:27 PM IST
YS Jagan
X

YS జగన్ ఫైల్ ఫోటో 

ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ 90 రోజుల్లోగా పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంపై క్యాంపు కార్యాలయంలో సంబంధిత మంత్రులు, అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. లబ్ఢిదారులందరికీ పట్టాలు అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇళ్ల పట్టాల పంపిణీ అన్నది నిరంతర ప్రక్రియ అని జగన్‌ అధికారులకు సూచించారు. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story