రెండంతస్థుల ఇంటిని కుప్ప కూల్చిన సిలిండర్

రెండంతస్థుల ఇంటిని కుప్ప కూల్చిన సిలిండర్
x
మదనపల్లె
Highlights

చిత్తూరు జిల్లా మదనపల్లెలో గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల ఇల్లు కుప్పకూలింది. ఇవాళ వేకువజామున మంగళవీధిలోని అమర్నాథ్ ఇంటిలో నిద్రిస్తుండగా గ్యాస్...

చిత్తూరు జిల్లా మదనపల్లెలో గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల ఇల్లు కుప్పకూలింది. ఇవాళ వేకువజామున మంగళవీధిలోని అమర్నాథ్ ఇంటిలో నిద్రిస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇంటిలో నిద్రపోతున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాక ఇంటి పక్కన ఉన్న గేదెల షెడ్డులో ఓ గేదె మృతిచెందగా, మరో గేదె గాయపడింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, వన్టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories