Ganta Srinivasa Rao: భోగాపురం ఎయిర్ పోర్టుపై అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట ఇప్పుడో మాట


Ganta Srinivasa Rao: భోగాపురం ఎయిర్ పోర్టుపై అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట ఇప్పుడో మాట
Ganta Srinivasa Rao: ఏపీ సీఎం ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు
Ganta Srinivasa Rao: మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు AP CM జగన్ పై ఫైర్ అయ్యారు. ఇదే భోగాపురం ఎయిర్ పోర్టు గురించి అధికారంలో లేనప్పుడు ఏమన్నారు? ఇప్పుడేం చేస్తున్నారు? నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు... ఊసరవెల్లి కూడా ఇంత తొందరగా రంగులు మార్చదేమోనని ఆయన ఎద్దేవా చేశారు. YCP అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.
TDP నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని... అంతేకాక విశాఖ రిషికొండనూ ధ్వంసం చేసారనీ గంటా మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు అవుతారన్న YCP ప్రచారం భ్రమేనని తెలిపారు. సిట్ తమకు అనుకూలంగా వచ్చిందని YCP నేతలు సంబరాలు చేసుకుంటున్నారు గానీ... జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని గంటా చెప్పారు. ప్రజలు ఓట్లతో జగన్ సర్కార్కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



