ఏపీలో విషాదం.. కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి

Lododdi Village: తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 2 Feb 2022 4:34 PM IST
Four Persons are Dead After Drinking Jeedi Toddy
X

ఏపీలో విషాదం.. కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి

Lododdi Village: తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. రంపచోడవరం మండలం లొదుడ్డిలో జీలుగ కల్లు తాగి గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించగా.. నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే.. జీలుగ కల్లులో విషం కలిసినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story