Fishermen Safe: సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు సేఫ్
* అమలాపురం వద్ద క్షేమంగా ఉన్న మత్స్యకారులు
సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు సేఫ్
Fishermen Safe: మచిలీపట్నం సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమయ్యింది. అమలాపురం వద్ద క్షేమంగా ఉన్నట్లు ఫోన్లో బంధువులకు సమాచారం ఇచ్చారు మత్స్యకారులు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఐదు రోజులుగా కన్పించకుండాపోయారు. దీంతో మత్స్యకారుల కోసం పోలీస్, రెవెన్యూ, ఫిషరీస్, మెరైన్, కోస్ట్ గార్డ్, నేవల్, వాతావరణ శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. కొత్తలంక లైట్ హౌస్ సమీపంలో కృష్ణా జిల్లా ఫిషింగ్ బోట్ ఉన్నట్లు గుర్తించారు. వైద్య సిబ్బందితో బోట్ దగ్గరకు వెళ్తున్నారు మెరైన్, కాట్రేనికోన పోలీసులు.
Next Story




