AP News: మన్యం జిల్లాలో దారుణం.. విద్యుత్ షాక్‌తో నాలుగు ఏనుగులు అక్కడికక్కడే మృతి

Four Elephants Died On The Spot Due to Electric Shock
x

AP News: మన్యం జిల్లాలో దారుణం.. విద్యుత్ షాక్‌తో నాలుగు ఏనుగులు అక్కడికక్కడే మృతి 

Highlights

AP News: బొకన్న చెరువు దగ్గర ట్రాన్స్‌ఫార్మర్ తాకి ఏనుగులు మృతి

AP News: ఉమ్మడి శ్రీకాకుళం పార్వతీ పురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ సమీపంలో... దారుణం చోటు చేసుకుంది. 6 ఏనుగుల గుంపులో విద్యుత్ షాక్ కు గురై నాలుగు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బొమ్మిక గ్రామం వద్ద వున్న బొకన్న చెరువు దగ్గరలో ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొట్టి దానిని ధ్వంసం చేసే ప్రక్రియ నేపధ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఏనుగులు షాక్ తిన్న వెంటనే మిగిలిన మరో రెండు ఏనుగులు తివ్వా కొండలపైకి వెళ్లినట్టు తెలుస్తోంది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories