Andhra Pradesh: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురి మృతి
Andhra Pradesh: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం 4గురు మృతి చెందారు.
ది హన్స్ India
Andhra Pradesh: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెనుగొండ మండలం ఎర్రమంచి సమీపంలోని కియా కార్ల ఫ్యాక్టరీ దగ్గర ఓ కారు.. గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా బెంగళూరులోని యశ్వంత్పూర్కు చెందినవారుగా గుర్తించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
Next Story




