మదనపల్లె దస్త్రాల దహనం కేసులో కీలక మలుపు.. మాజీ ఆర్డీవో మురళి అరెస్ట్

Madanapalle: మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 19 Sept 2025 12:13 PM IST
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో కీలక మలుపు.. మాజీ ఆర్డీవో మురళి అరెస్ట్
X

Madanapalle: మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మదనపల్లె పూర్వ ఆర్డీవో మురళిని సీఐడీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆయనకు గతంలో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

గతేడాది జూలై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ దస్త్రాలు అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, ఆనాటి ఆర్డీవో మురళిని ఈ ఘటనకు ప్రధాన కారకుడిగా గుర్తించారు. ఈ కేసులో ఆయనకు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయితే, నిన్న సుప్రీంకోర్టు ఈ బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే సీఐడీ పోలీసులు రంగంలోకి దిగారు. తిరుపతిలో ఉన్న మురళిని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. మురళి 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లె ఆర్డీవోగా పనిచేశారు. బెయిల్ రద్దయిన 24 గంటల్లోపే ఆయన అరెస్టు కావడం గమనార్హం. ఈ కేసులో తదుపరి దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story