
నిన్న చంద్రబాబు టీమ్కు ప్రమాదం తప్పగా.. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న టీడీపీ
*మధ్యాహ్నం 3.20కి విజయసాయిరెడ్డి ట్వీట్ *చంద్రబాబు జారిపడటమే తరువాయి అంటూ ట్వీట్
Andhra Pradesh: వైసీపీ, టీడీపీ మధ్య వరద పర్యటన విమర్శలు ప్రతివిమర్శలకు దారితీస్తోంది. నిన్న చంద్రబాబు టీమ్కు ప్రమాదం తప్పగా.. అది ముందే వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఎలా తెలుసంటూ కౌంటర్ వేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు బృందం సోంపల్లి రేవు వద్ద నీళ్లలో పడిపోయారు. మాజీ మంత్రి దేవినేని ఉమ సహా పలువురు నేతలు నీళ్లలో పడగా ప్రమాదం తప్పింది.
ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు సాయంత్రం 5 గంటలకు పడవ ప్రమాదం జరిగిదే మధ్యాహ్నం 3.20కి విజయసాయిరెడ్డి ఎలా ట్వీట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు జారిపడటమే తరువాయి అంటూ విజయసాయి చేసిన ట్వీట్ ను క్వశ్చన్ చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు కనీస భద్రత కల్పించలేదని.. పంటు నుంచి పడవలోకి చంద్రబాబును ఎందుకు మార్చారని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న ఉమ డిమాండ్ చేశారు.
వెన్నుపోట్లతో అడ్డదారిలో రాజకీయ శిఖరాగ్రానికి చేరి ఇప్పుడు బాధితుడిగా మారి అక్కడి నుంచి జారి పడడమే జరగబోయే పరిణామం. కాలం మీ పాపాలను మరుగుపరిచినా…కర్మ వదలదు...అది వెంటాడుతూనే ఉంటుంది చంద్రబాబు!
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 21, 2022

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




