Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి

Road Accident: తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు.

Arun Chilukuri
Published on: 6 Dec 2025 12:36 PM IST
Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి
X

Road Accident: తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. రెండు కార్లు పరస్పరం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రామేశ్వరం ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తున్న అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనాలకు ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు.

ఈ ఘటనలో మరో ఏడుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story