ఏపీలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు

ఏపీలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
x
Highlights

ఏపీలో మొదటిసారిగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అమల్లోకొచ్చిన ఈ విధానం ద్వారా కృష్ణా జిల్లా నందిగామ సబ్‌ డివిజన్‌ పరిధిలో మొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు...

ఏపీలో మొదటిసారిగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అమల్లోకొచ్చిన ఈ విధానం ద్వారా కృష్ణా జిల్లా నందిగామ సబ్‌ డివిజన్‌ పరిధిలో మొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వీరులపాడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన గగులోతు ధర్మతేజ అనే బాలుడు తప్పిపోగా అతడిని వెతుక్కుంటూ వచ్చిన హాస్టల్ వార్డెన్ మరియు బాలుడి తల్లిదండ్రులు కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే ఈ కేసు వీరులపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చినా కంచికచర్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నందిగామ డీఎస్పీ జీవీ రమణమూర్తి, నందిగామ రూరల్‌ సీఐ సతీశ్‌ ఆధ్వర్యంలో బాలుడి తండ్రి రవినాయక్‌ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. ఇటు కంచికచర్ల, వీరులపాడు ఎస్సీల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ మండలం వీరంపాడులో బాలుణ్ణి గుర్తించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories