తొలి విడత పంచాయతీ ఫలితాలు సంతృప్తినిచ్చాయి: పవన్
తొలి విడత పంచాయతీ ఫలితాలు సంతృప్తినిచ్చాయన్నారు జనసేనాని పవన్. వచ్చే మూడు దశల్లోనూ ఇదే స్పూర్తిని జనసేన శ్రేణులు కనబరచాలని పిలుపునిచ్చారు. 18శాతానికి పైగా ఓట్లతో సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నాం అన్న పవన్.. వెయ్యికి పైగా వార్డుల్లో విజయం సాధించినట్లు తెలిపారు. మొత్తం 17 వందల పంచాయతీల్లో రెండో స్థానం దక్కిందన్న జనసేనాని ఫలితాలు చూస్తుంటే మార్పు మొదలైందని అర్థమవుతుందన్నారు.
Next Story




